ఈసారి ఏపీ సీఎం ఫై విరుచుకుపడ్డ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్

rajasingh

నిత్యం టిఆర్ఎస్ ముఖ్యమంత్రి ఫై విరుచుకపడే బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్..ఈసారి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ తీరుతో తిరుపతి, ఏపీకి చెడ్డ పేరు వస్తోందని మండిపడ్డారు. తిరుపతిలోని అలిపిరి చెక్‌ పోస్టు వద్ద అధికార్లు, భక్తుల వాహనాలపై ఉండే హిందూ దేవుళ్ల స్టిక్కర్లను తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహారాష్ట్ర భక్తులు తీసుకోస్తున్న ఛత్రపతి శివాజీ విగ్రహాలను అనుమతించమని పోలీసులు చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ చర్యల ఫలితంగా.. మహారాష్ట్ర సోషల్​ మీడియాలో బాయ్​కాట్​ తిరుపతి అంశం వైరల్​ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనంతటికీ కారణం.. జగన్​ తప్పుడు నిబంధనలేనని ఆరోపించారు. జగన్ ఏ దేవుడిని నమ్ముతారో దేశ ప్రజలకు తెలుసు అని రాజాసింగ్ అన్నారు. మరి రాజాసింగ్ వ్యాఖ్యల ఫై వైస్సార్సీపీ నేతలు ఎలా స్పందిస్తారో..