మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనీ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ డిమాండ్

టిఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనీ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ డిమాండ్ చేసారు. వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీనివాస్ గౌడ్ ర్యాలీ లో పాల్గొన్నారు. కాగా ర్యాలీలో జనం మధ్య ఆయన తుపాకీతో కాల్పులు జరపడం ఇప్పుడు వివాదంలోకి నెట్టాయి. పోలీసుల చేతుల్లోని తుపాకీని తీసుకుని ఆయన గాల్లోకి కాల్పులు జరిపిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవ్వడం.. మరోవైపు అధికారులు సైతం ఆయన్ని అడ్డుకోలేదనే విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.

దీనిపై బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ స్పందించారు. పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ నుంచి తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపిన ఆయనపై ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. బాధ్యత కలిగిన మంత్రి పీఎస్వో దగ్గర గన్ తీసుకుని కాల్చటం చట్ట విరుద్ధమని రఘునందన్ అన్నారు. గన్ సీజ్ చేసి ఎఫ్ఎస్ఎల్ కు ఎందుకు పంపలేదన్న రఘునందన్.. శ్రీనివాస్ గౌడ్ పై ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని అన్నారు. విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే శ్రీనివాస్ గౌడ్ను పదవి నుంచి తప్పించాలని.. మంత్రి మీద నమ్మకం ఉంటే రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే డీజీపీ తీరుపైనా రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్ అయిన తర్వాత వచ్చే ప్రభుత్వ సలహాదారు పదవి కోసం ఆశపడి ఆయన మౌనంగా ఉండటం సరికాదని హితవు పలికారు. ఒకవేళ డీజీపీ మంత్రిపై చర్యలు తీసుకోకుంటే తానే హైకోర్టులో పిల్ వేస్తానని రఘునందన్ రావు స్పష్టం చేశారు.