మరో వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేకు కరోనా

కృష్ణా జిల్లా కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు కరోనా

YSR Congress Party
YSR Congress Party

అమరావతి: ఏపిలో ఇప్పటికే పలువురు వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేలు కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేకు కరోనా సోకింది. కృష్ణా జిల్లా కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని ఈ రోజు ఉదయం నిర్ధారణ అయింది. దీంతో ఆయన వెంటనే తన స్వగ్రామం నుంచి చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. ప్రస్తుతం దూలం నాగేశ్వరరావు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరినట్లు తెలిసింది. గత 10 రోజులుగా తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించినట్లు సమాచారం. ఆయన సూచనలతో పలువురు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/