కరోనా ఎఫెక్ట్… అమిత్ షా సభ వాయిదా

ఈ నెల 15న హైదరాబాద్‌లో బిజెపి తలపెట్టిన సీఏఏ అనుకూల సభ

bjp
bjp

న్యూఢిల్లీ: బిజెపి ఈ నెల 15న హైదరాబాద్‌లో సీఏఏ అనుకూల సభ నిర్వహించాలని ఏర్పాట్లు చేసింది. కాగా ఈసభ వాయిదా పడింది. ఈసభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. అయితే తాజాగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ భయాందోళనలు రేకెత్తిస్తున్న నేపథ్యంలో… భారీ బహిరంగ సభలకు దూరంగా ఉండాలని ప్రధాని నరేంద్రమోదీ పార్టీ నేతలకు సూచించారు. ఈ కారణంగానే హైదరాబాద్‌లో అమిత్ షా పాల్గొనబోయే సభ వాయిదా పడినట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టిన తరువాత సభను నిర్వహించే యోచనలో తెలంగాణ బీజేపీ నేతలు ఉన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/