తెలుగు తెర కు  మిర్నా మీనన్ ప‌రిచ‌యం

Mirna Menon is introduced to the Telugu screen
Mirna Menon is introduced to the Telugu screen

శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పై నిర్మాత కెకె రాధామోహన్ త‌మ బ్యానర్ నుండి ప్రొడక్షన్ నంబర్ 10గా పూర్తి వినోదాత్మ‌క చిత్రాన్ని నిర్మిస్తున్నారు, 

ఇందులో హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు..నూతన దర్శకుడు ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు

ప్రస్తుతం ప్రముఖ తారాగణంతో కూడిన సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవ‌లే ఈ సినిమాలో ఆది సాయికుమార్ సరసన హీరోయిన్‌ గా దిగంగన సూర్యవంశీ ఎంపికైంది. ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్‌ గా మిర్నామీనన్ను ఆహ్వానించారు.  గతంలో మలయాళం, తమిళంలో కొన్ని చిత్రాలలో నటించిన మిర్నాకు ఈ చిత్రం తెలుగు అరంగేట్రం. ఈ సినిమాలో హీరోయిన్లు.ఇద్దరికీ త‌గిన ప్రాధాన్యత ఉంటుంది.సాంకేతిక బృందం విషయానికి వస్తే, ఈ చిత్రానికి సంగీతం ఆర్ఆర్ ధృవన్, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/