హైదరాబాద్ నడిబొడ్డున మరో మైనర్ బాలిక ఫై అత్యాచారం

హైదరాబాద్ లో మరో దారుణం చోటుచేసుకుంది. పుట్టిన రోజు వేడుకలకు పిలిచినా మైనర్ బాలిక ఫై కారు లో అత్యాచారం చేసిన ఘటన నెక్లెస్ రోడ్ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

మల్లేపల్లి, విజయనగర్ కాలనీ ప్రాంతంలో జిరాక్స్ షాపులో పనిచేసే సురేశ్(23)కి హాస్టల్లో ఉంటూ కళాశాలకు వెళ్తున్న అనాథ బాలిక (17)తో పరిచయం పెంచుకున్నాడు. ఆమెతో తరచుగా బయట కలిసి మాట్లాడేవారని.. బాలికకు బహుమతిగా మొబైల్ కూడా ఇప్పించాడని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 20వతేదీన కళాశాలకు వెళ్తున్నానని హాస్టల్ వార్డెన్​కు చెప్పిన బాలిక.. మరో ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి స్నేహితుని పుట్టినరోజు వేడుకలకు వెళ్తూ సురేశ్​ను కూడా పిలిచింది.

అదే రోజు రాత్రి 12 గంటలకు నెక్లెస్ రోడ్డుకు చేరుకోగా కొంతసేపటికే స్నేహితులు పుట్టినరోజు వేడుకల్లో నిమగ్నమై ఉన్నారు. అదే అదునుగా భావించిన సురేశ్.. బాలికతో మాట్లాడేందుకు అని చెప్పి పక్కను తీసుకెళ్లి అక్కడున్న కారులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అనాథ కావడంతో గోల్కొండ ఐసీడీఎస్ సూపర్​వైజర్ హుమయూన్ నగర్ పోలీసులకు ఈనెల 4వతేదీన ఫిర్యాదు చేసింది. అక్కడ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు రాంగోపాల్ పేట్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు సురేశ్​ను రిమాండుకు తరలించారు.