తాజ్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్ర‌మాదం

న్యూఢిల్లీ: నేడు ఢిల్లీ నుంచి ఝాన్సీ వెళ్తున్న తాజ్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఆ రైలుకు చెందిన ఏసీ బోగీలో ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు నార్త‌ర్న్ రైల్వేస్ వెల్ల‌డించింది. ఉద‌యం 7.40 నిమిషాల స‌మ‌యంలో ఏసీ బోగీ నుంచి పొగ వ‌స్తున్న‌ట్లు గుర్తించారు. దీంతో రైలును హ‌ర్యానాలోని అసోతి స్టేష‌న్ వ‌ద్ద ఆపేశారు.

బ్రేక్ జామ్ కావ‌డం వ‌ల్ల అగ్నిప్ర‌మాదం సంభ‌వించిన‌ట్లు ఓ రైల్వే అధికారి చెప్పారు. మంట‌ల్ని ఆర్పేశామ‌ని, ప్ర‌యాణికులు అంద‌రూ సుర‌క్షితంగా ఉన్నార‌ని, చాలా స్వ‌ల్ప స్థాయిలో మంట‌లు వ‌చ్చాయ‌ని, నిప్పు క‌న్నా ఎక్కువ‌గా పొగ వ్యాపించిన‌ట్లు సీపీఆర్వో దీప‌క్ కుమార్ తెలిపారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/