స్వరూపానందస్వామి ఆశీస్సులు తీసుకున్న మంత్రి విడదల రజిని

మంత్రి అయిన తర్వాత తొలిసారి స్వరూపానంద పీఠానికి వచ్చిన విడదల రజని

విశాఖ: ఏపీ మంత్రి విడదల రజని నేడు విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులను తీసుకున్నారు. విశాఖలోని శారదాపీఠానికి వెళ్లిన ఆమె స్వరూపానంద పాదాలకు నమస్కరించారు. విడదల రజని మంత్రి పదవిని చేపట్టిన తర్వాత స్వరూపానంద ఆశీర్వాదాలు తీసుకోవడం ఇదే తొలిసారి.

ఈ సందర్భంగా ఆమెతో స్వరూపానంద కాసేపు ముచ్చటించారు. బాగున్నారా? అని స్వరూపానంద ప్రశ్నించగా… మీ ఆశీర్వాదాల వల్ల జగనన్న బాగుంటే… తామందరం బాగుంటామని ఆమె చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖను విజయవంతంగా నిర్వహించేలా దీవించమంటూ పీఠాధిపతులను కోరారు. ఆ తర్వాత రజనికి స్వరూపానంద చీరను బహూకరించారు. అనంతరం రజని రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/