విపక్షాల మాటలు నమ్మవద్దు : తలసాని

రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేస్తాం ..మంత్రి తలసాని

కడప : హుజురాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యార్థి నాయకుడు, నిరంతరం ప్రజల కోసం కష్టపడే వ్యక్తిని టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ముఖ్యమంత్రి ప్రకటించారని తెలిపారు. యువకుడు కాబట్టి హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఆయన మరింత అభివృద్ధి చేస్తారని అభిప్రాయపడ్డారు. మహిళలకు కూడా సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.

అభివృద్ధికే పట్టం కట్టాలని హుజురాబాద్ ప్రజలను కోరుతున్నామని మంత్రి తలసాని అన్నారు. రైతుబంధు, దళితబంధు పథకాలపై విపక్షాలది అనవసర ఆరోపణలని కొట్టిపారేశారు. విపక్షాల మాటలు నమ్మవద్దని, త్వరలో తెలంగాణ వ్యాప్తంగా దళిత బంధు అమలు చేస్తామని పేర్కొన్నారు. బాధ్యత లేకుండా విపక్షాలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాయని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఏడేళ్ల కాలంలో 74 ఏళ్ల చరిత్ర తిరగ రాశారన్నారు. ఇరిగేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని గుర్తుచేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/