శ్రీవారిని దర్శించుకున మంత్రి శ్రీనివాస్‌ గౌడ్

తిరుమల: ఈరోజు ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శనం సమయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ పండితులు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు వేదాశీర్వాదం అందించగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలు ప్రగతిపథంలో నడవాలని ఆకాంక్షించారు. తెలంగాణలో పురాతన ఆలయాలకు టీటీడీ సహకారం అదించాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కుల మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌ దేశ రాజకీయాల్లో కీలక బూమిక పోషిస్తారని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/