చేనేత కార్మికులకు అండగా ఉంటాం : మంత్రి రోజా

విజయవాడలో ఆప్కో షోరూంను సందర్శించిన మంత్రి ఆర్కే రోజా

విజయవాడ: ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఆప్కో సమ్మర్ మేళా సందర్భంగా ఈరోజు విజయవాడలోని ఆప్కో షోరూమ్ ను సందర్శించారు. మేళాకు ఆహ్వానించినందుకు సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. ప్రతి ఊరిలోనూ ఆప్కో శాఖలున్నాయన్నారు. ప్రత్యేక ఆఫర్లు, డిజైన్లతో ఆప్కో అందరినీ ఆకర్షిస్తోందని చెప్పారు. అన్ని రకాల కలెక్షన్లు షోరూంలో దొరుకుతాయన్నారు. చేనేత కార్మికులకు అండగా ఉంటామని రోజా అన్నారు. చేనేత కార్మికుల బాగు కోసం వారి కుటుంబాలకు ఏటా జగన్ ప్రభుత్వం రూ.24 వేలు ఇస్తోందని గుర్తు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/