టిడిపి హయాంలో డేటా చోరీ జరిగిందిః మంత్రి రోజా

చంద్రబాబు ఒక్క పథకాన్ని కూడా సొంతంగా అమలు చేయలేదు

chandrababu-is-more-dangerous-than-dera-baba-says-roja

అమరావతిః టిడిపి ప్రభుత్వ హయాంలో డేటా చోరీ జరిగిందని మంత్రి రోజా అన్నారు. డేటా దొంగ చంద్రబాబు అని విమర్శించారు. డేరా బాబా కంటే డేటా దొంగ చాలా డేంజరస్ అని చెప్పారు. ప్రజా సాధికారత సర్వే పేరుతో సేవా మిత్ర ద్వారా టిడిపి నాయకులకు విలువైన సమాచారాన్ని అందించారని తెలిపారు. ఈ అంశంపై వేసిన హౌస్ కమిటీ తన రిపోర్టును ఇవ్వగానే టిడిపి నేతల గుండెలు జారిపోయాయని చెప్పారు. డేటా చోరీ అంశంపై చంద్రబాబు కోర్టులో స్టే తెచ్చుకోకపోతే జీవితాంతం జైల్లో ఉంటారని అన్నారు. దాదాపు 30 లక్షల ఓట్లను అక్రమంగా తొలగించాలని దుర్మార్గపు ఆలోచన చేశారని విమర్శించారు.

ఆరోజు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్‌ఆర్‌సిపికి చెందిన 23 మంది ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాపింగ్ చేయించి, వారిని బ్లాక్ మెయిల్ చేసి టిడిపిలో చేర్చుకున్నారని చెప్పారు. నారా లోకేశ్ ఒళ్లు తగ్గించుకోవడానికి ఏవేవో చేశారని… బుర్రలో గుజ్జును పెంచుకోవడానికి కూడా ఏదైనా చేస్తే బాగుంటుందని రోజా ఎద్దేవా చేశారు. అన్నా క్యాంటీన్లు ఎన్ని పెట్టారో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. చంద్రబాబు ఏ ఒక్క పథకాన్ని కూడా సొంతంగా అమలు చేయలేదని అన్నారు. టిడిపి నేతలకు సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/