చంద్రబాబు స్క్రిప్ట్ ను పవన్ చదువుతున్నాడు – మంత్రి రోజా

వైస్సార్సీపీ మంత్రి రోజా..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై విరుచుకపడ్డారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ను చదవకండి అని హితువు పలికారు. కోనసీమ అల్లర్లఫై పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై చేసిన విమర్శల ఫై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తుని సంఘటన మేమే చేయించాం అని విమర్శించారు.. ఆ సయమంలో అధికారం ఉన్న టీడీపీ ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. మీరు అసలు ఆలోచించి మాట్లాడుతున్నారా..? లేక చంద్రబాబు స్ట్రిప్టు చదువుతున్నారా..? అని రోజా ప్రశ్నించింది.

ఎస్సీ మంత్రి, బీసీ ఎమ్మెల్యే ఇళ్లు తగలబెట్టడం అన్యాయమన్నారు. దాడి చేసిన వారిలో 50 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అమలాపురం అల్లర్లపై కేసు విచారణ జరుగుతోందన్నారు. తప్పు చేసిన వారిని విడిచిపెట్టే ప్రస్తకే లేదన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనపై బురద చల్లడానికి ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. అంబేద్కర్‌ వలనే మనమంతా క్షేమంగా ఉన్నామని, అలాంటి అంబేద్కర్‌ పేరు పెడితే గొడవలు చేయడం ఏంటని ప్రశ్నించారు. కుట్ర వెనుక ఎవరున్నారో బయటకు లాగుతామని తెలిపారు.

కోనసీమ కోసం ఆత్మహత్యకు పాల్పడుతా అన్న వ్యక్తి జనసేన కార్యకర్తే అని రోజా ఆరోపించారు. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టాలని గతంలో చంద్రబాబు అన్నారని… ఈ రోజు ఎందుకు వ్యతిరేఖిస్తున్నారో తెలుస్తోందని… డబుల్ స్టాండడ్ గా వ్యవహిస్తున్నారని విమర్శిస్తున్నారు. అంబేద్కర్ పేరు పెట్టడాన్ని ప్రతిపక్షాలు స్వాగతించాయని.. ఇప్పుడు విమర్శిస్తున్నారని అన్నారు. ఈ ఘటన వెనక ఉన్నవారిని, తప్పు చేసిన వారిని వదిలేది లేదని రోజా హెచ్చరించారు. ప్రధాన నిందితుడు అన్యం సాయి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తో దిగిన ఫోటోలే అందుకు నిదర్శనం అని ఆరోపించారు.