సినీ ఎగ్జిబిట‌ర్ల‌ తో భేటీ కానున్న పేర్ని నాని

అమరావతి: మంత్రి పేర్ని నాని కాసేప‌ట్లో సినీ ఎగ్జిబిట‌ర్ల‌తో భేటీ కానున్నారు. ప‌శ్చిమ‌గోదావ‌రి,కృష్ణా,గుంటూరు జిల్లా జేసీలు,ఎగ్జిబిట‌ర్ల‌తో మంత్రి భేటీ కానున్నారు. ఆన్ లైన్ టికెట్ విధానం, సినిమాటోగ్ర‌ఫీ చ‌ట్టంలో స‌వ‌ర‌ణ‌ల‌పై చ‌ర్చించ‌నున్నారు. విద్యుత్ రాయితీలు,రేట్ ఆఫ్ అడ్మిష‌న్ స‌హా లైసెన్స్ ల జారీ స‌ర‌ళ‌త‌రం చేయాల‌ని ఎగ్జిబిట‌ర్లు కోర‌నున్నారు. అన్ని సినిమాల‌కు టిక్కెట్ ఒకే రేటు ఉండేలా కొత్త విధానంపైనా చ‌ర్చ జ‌ర‌గ‌నుంది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/