కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కు కరోనా పాజిటివ్

న్యూఢిల్లీ : కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు బయటపడటంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి జైశంకర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇటీవలి కాలంలో తనను కలిసినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కాగా, దేశంలో కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు కోవిడ్ బారిన పడ్డారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/