అభిమానుల కోరిన తీర్చిన మంత్రి మల్లారెడ్డి

మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఏదొక వార్తతో మీడియాలో నిలువడం ఆయనకు అలవాటు. మాములు రోజుల్లోనే మీడియా లో హైలైట్ అయ్యే మల్లారెడ్డి..ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్బంగా మరింతగా హైలైట్ అయ్యారు. పుట్టిన రోజు సందర్బంగా బోయిన్ పల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయానికి అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో కొంతమంది వీరాభిమానులు మంత్రి మల్లారెడ్డి వద్దకు గుర్రాన్ని తీసుకొచ్చారు.

మంత్రిని ఆ గుర్రం ఎక్కాలని కోరారు. అభిమానుల కోరిక మేరకు మంత్రి మల్లారెడ్డి గుర్రమెక్కారు. వాళ్లను ఖుషీ చేసేందుకు గుర్రం మీద కూర్చొని ఫోటోలకు మంచి ఫోజులు కూడా ఇచ్చారు. ఆయన అలా గుర్రమెక్కి ఫోజలు పెడతోంటే… క్యాంపు కార్యాలయం మొత్తం జై మల్లన్న.. జై మల్లన్న అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం మల్లారెడ్డి గుర్రపు పోజ్లు సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.