గుండె తరలింపు..మెట్రో అధికారులను అభినందించిన కెటిఆర్‌

హైదరాబాద్‌: గ్రీన్‌ఛానల్‌ ఏర్పాటు చేసిన గుండె తరలిపునకు సహకరించిన మెట్రో అధికారులను మంత్రి కెటిఆర్‌ అభినందించారు. ఈ సంద‌ర్భంగా ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని కెటిఆర్ అభినందించారు. అవ‌య‌వ‌దాత న‌ర్సిరెడ్డి కుటుంబానికి మంత్రి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఒక ప్రాణాన్ని కాపాడేందుకు గుండెను 21 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌త్యేక రైలును న‌డ‌ప‌డం హర్షించ‌ద‌గ్గ విష‌య‌మ‌న్నారు. నిన్న మెట్రో రైలులో నాగోలు స్టేష‌న్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు స్టేష‌న్ వ‌ర‌కు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి గుండె త‌ర‌లింపున‌కు మెట్రో అధికారులు స‌హ‌క‌రించిన విష‌యం తెలిసిందే.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/