అంబులెన్స్‌లను ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌

Minister KTR who launched the ambulances

హైదరాబాద్‌: మంత్రి కెటిఆర్‌ జన్మదిన సందర్భంగా చేపట్టిన ‘ గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమంలో భాగంగా అంబులెన్స్‌ల ప్రారంభోత్సవం కొనసాగుతుంది. ఇందులో భాగంగానే 19 అంబులన్స్‌లను మంత్రి కెటిఆర్‌ ప్రగతిభవన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈమేరకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పేదలు, కరోనా బాధితులను ఆదుకునేందుకు అంబులెన్స్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు మాలోతు కవిత, గడ్డం రంజిత్ రెడ్డి, టిఆర్ఎస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ వై సతీష్ రెడ్డి, జెట్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/