క్షమాపణ చెప్పాల్సింది బీజేపీ.. దేశం కాదు : మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : మత ప్రబోధకుడిపై బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత రాయబారులను పిలిపించి ముస్లిం దేశాలు నిరసన లేఖలు అందించంతో ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలకు దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించిన కేటీఆర్… బీజేపీ నేతల తీరు వల్ల అంతర్జాతీయ సమాజానికి దేశం క్షమాపణ చెప్పాల్సి వస్తుందన్నారు. క్షమాపణ చెప్పాల్సింది బీజేపీ తప్ప దేశం కాదని కేటీఆర్ పేర్కొన్నారు. విద్వేషం వెదజల్లుతున్నందుకు తొలుత ప్రజలకు బీజేపీ క్షమాపణ చెప్పాలని ట్విటర్లో మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/career/