ఆ ఆరోపణలపై ప్రధాని మోడీ ఎందుకు స్పందించరు..? కేటీఆర్
హైదరాబాద్: ప్రధాన మంత్రి మోడీ, అదానిలను విమర్శిస్తూ ప్రశాంత్ భూషన్ చేసిన ట్వీట్ను రాష్ట్ర మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష నాయకులను ఈడీ, సీబీఐ, ఐటీ టార్గెట్ చేయడం సర్వసాధారణమని అన్నారు. వారిపై దాడులూ సాధారణమని ట్వీటారు. కానీ పవన విద్యుత్ కాంట్రాక్టులు అదానీకి ఇవ్వాలని శ్రీలంక ప్రభుత్వంపై మోడీ ఒత్తిడి తెస్తున్నారని శ్రీలంక ప్రభుత్వ అధికారులు చేసిన ఆరోపణలపై ప్రధాని, అదానీలెవరూ స్పందించరని ఎద్దేవా చేశారు. ఈ విషయంపై మీడియా కూడా నిశబ్ధం వహిస్తోందని విమర్శించారు. రాహుల్ గాంధీపై ఈడీ విచారణ కొనసాగుతున్న తరుణంలో ఈ ట్వీట్ చర్చనీయాంశమైంది.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/