క‌రోనా నుంచి కోలుకున్న మంత్రి కెటిఆర్‌..అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రు

కెటిఆర్‌కు క‌రోనా నెగెటివ్ రిపోర్ట్ వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డి

minister-ktr

హైదరాబాద్ః ఇటీవ‌లే క‌రోనా బారిన‌ప‌డిన మంత్రి కెటిఆర్‌కు సోమ‌వారం వైద్యులు ప‌రీక్ష‌లు చేయ‌గా… క‌రోనా నెగెటివ్‌గా వ‌చ్చింద‌ని పేర్కొన్నారు. ఫ‌లితంగా క‌రోనా నుంచి కెటిఆర్‌ పూర్తిగా కోలుకున్న‌ట్లు వైద్యులు ధ్రువీక‌రించారు. ఈ మేర‌కు టిఆర్ఎస్ పార్టీ సోమ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. రేప‌టి (మంగ‌ళ‌వారం) నుంచి అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా బారిన ప‌డ్డ కెటిఆర్ ఈ స‌మావేశాల‌కు హాజ‌ర‌వుతారా? లేదా? అన్న విష‌యంపై నిన్న‌టిదాకా సందిగ్ధ‌త నెల‌కొన‌గా… అసెంబ్లీ స‌మావేశాల ప్రారంభానికి ఓ రోజు ముందుగా ఆ సందిగ్ధ‌త వీడిపోయింది. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న నేప‌థ్యంలో అసెంబ్లీ స‌మావేశాల‌కు కెటిఆర్ హాజ‌ర‌వుతార‌ని టిఆర్ఎస్ ప్ర‌క‌టించింది.

కాగా, ఆగ‌స్టు 30వ తేదీన కెటిఆర్ క‌రోనా బారిన ప‌డ్డ విష‌యం విదిత‌మే. కెటిఆర్‌కు మొద‌టిసారి 2021, ఏప్రిల్ 23న క‌రోనా సోకింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/