పీవీకి భారతరత్న ప్రకటించాలి..మంత్రి కెటిఆర్
హైదరాబాద్: అసెంబ్లీలో పీవీ శతజయంతి ఉత్సవాలు సందర్భంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ…పీవీకి భారతరత్న ఇవ్వాలని సిఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తున్నామని కెటిఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పీవీకి భారతరత్న ప్రకటించాలి. యుద్ధంలో గెలిచినవాడే చరిత్రను రాస్తారు అని ఒక సామెత ఉంది. రాష్ర్ట ఏర్పాటు జరిగి 6 సంవత్సరాలు పూర్తయింది. పీవీ ఒక్కరే కాదు.. తెలంగాణకు సంబంధించిన ఎంతో మంది వైతాళికులు మరుగునపడ్డారు.. ఈశ్వరీభాయి, భాగ్యరెడ్డి వర్మ, సురవరం ప్రతాపరెడ్డి, దొడ్డి కొమురయ్య, పైడి జయరాజ్, చాకలి ఐలమ్మ లాంటి ఎందరినో తెలంగాణ సాంస్కృతిక శాఖ గౌరవించుకుంది. మహానుభావుల జయంతి, వర్ధంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంది. వీరి స్ఫూర్తిని భవిష్యత్ తరాల్లో నింపాలి. పీవీ నరసింహరావు అద్భుతమైన వ్యక్తి. ఏ రంగంలో తనకు బాధ్యతలు అప్పజెప్పిన.. ఆ రంగంలో సంస్కరణలు చేపట్టి ప్రజలకు ఎంతో మేలు చేశారు. భూసంస్కరణలు మొదలు పెట్టి పేదలకు తన భూమిని పంచిన మహానుభావుడు పీవీ అని కెటిఆర్ గుర్తు చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/