ఈ సారి కూడా తామే గెలుస్తాం..కెటిఆర్
ఆరేళ్లలో హైదరాబాద్కు బిజెపి ఏం చేసిందో చెప్పగలరా?
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ భవన్లో ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ..ఆరేళ్లలో హైదరాబాద్కు బిజెపి ఏం చేసిందో చెప్పగలరా? ప్రశ్నించారు. దేశంలో ముస్లింలపై బిజెపికి ఎంత విద్వేషం ఉందో అందరికీ అర్థమవుతోందని చెప్పారు. లోయర్ సీలేరును ఏపిలో కలిపింది బిజెపియేనని ఆయన అన్నారు. దేశాన్ని బిజెపి అమ్మేస్తోందని కెటిఆర్ ఆరోపించారు. తమపై బిజెపి చార్జిషీట్లు విడుదల చేస్తోందని, పేకాట క్లబ్లు మూసివేయించినందుకు తమపై చార్జిషీట్లు విడుదల చేస్తుందా? అని ఆయన నిలదీశారు. బిజెపి లక్షల మంది చిరు వ్యాపారుల పొట్టగొట్టిందని ఆయన ఆరోపించారు. వారంతా బిజెపిపైనే చార్జిషీట్ వేయాలని అన్నారు.
కరోనా సమయంలో లాక్డౌన్ విధించడంతో చనిపోయిన వలస కార్మికుల ఆత్మలు చార్జిషీట్ వేయాలని ఆయన వ్యాఖ్యానించారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడుతున్నారని ఆయన అన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ దేశ భవిష్యత్ కోసమా? గుజరాత్ పెద్దల కోసమా? అని ఆయన ప్రశ్నించారు. ఆరేళ్లలో హైదరాబాద్కు బిజెపి ఏం చేసిందో చెప్పగలదా? అని ఆయన నిలదీశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ సారి కూడా తామే గెలుస్తామని, మజ్లిస్ రెండో స్థానంలో నిలుస్తుందని జోస్యం చెప్పారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/