బస్తీ దవాఖానాలపై మంత్రి కెటిఆర్ సమీక్ష
హైదరాబాద్: మంత్రి కెటిఆర్ బస్తీ దవాఖానాలపై సమీక్ష నిర్వహించారు. పేద ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలందడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రజారోగ్యాన్ని కాపాడడంలో బస్తీ దవాఖానాలు విజయవంతంగా పనిచేస్తున్నామని కొనియాడారు. బస్తీ దవాఖానాల ద్వారా ప్రతిరోజు 25 వేల మందికి ఓపీ సేవలు అందుతున్నాయని, బస్తీ దవాఖానాలకు పేదల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. మరో వంద బస్తీ దవాఖానాల ఏర్పాటు త్వరగా పూర్తి చేయాలని కెటిఆర్ ఆదేశించారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/