టిఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి పనులపై వీడియో

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపించాలని కెటిఆర్‌ విన్నతి

TS Minister KTR-
TS Minister KTR-

హైదరాబాద్‌: నగరంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధి పనులపై మంత్రి కెటిఆర్‌ ఓ వీడియో విడుదల చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్లీ తమ పార్టీనే గెలిపించాలని ఆయన కోరారు. ఖముఖ్యమంత్రి కెసిఆర్‌ గారి నాయకత్వంలో, మీ ఆశీర్వాదంతో ఆరేళ్లలో మన నగరంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలుచేశాం. హైదరాబాద్‌ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు డిసెంబర్ 1 నాడు కారు గుర్తుకు ఓటేద్దాంగ అని కెటిఆర్ కోరారు.

టిఆర్ఎస్ పాలనలో ఆరేళ్ల నగర అభివృద్ధి మీ కళ్ల ముందు ఉంచుతున్నామంటూ ఈ వీడియోలో చెప్పారు. హైదరాబాద్‌లో 24 గంటల విద్యుత్‌ సరఫరా, తాగునీటి సరఫరా అందిస్తున్నామని చెప్పారు. మెరుగైన ప్రజారవాణ, రహదారుల నిర్మాణం, డబుల్‌ బెడ్‌రూం‌ ఇళ్లు వంటివి అందించామని వివరించారు. అలాగే, బస్తీ దవాఖానాలు, మెరుగైన పోలిసింగ్‌, అన్నపూర్ణ కేంద్రాల ద్వారా రూ.5కే భోజనం సదుపాయం, చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి, అడవుల పెంపకం వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నామని కెటిఆర్ ఈ వీడియో ద్వారా చూపించారు. కారు గుర్తుకు ఓటు వేయడమంటే అభివృద్ధిని కాపాడుకోవడమేనని పేర్కొన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ :https://www.vaartha.com/andhra-pradesh/