తైవాన్ పెట్టుబడుల‌కు తెలంగాణ అత్యంత ప్రాధాన్య‌త

హైదరాబాద్ : ఇన్వెస్ట్ ఇండియా ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన తైవాన్ – క‌నెక్ట్ తెలంగాణ స్టేట్ స‌మావేశంలో మంత్రి కేటీఆర్ వ‌ర్చువ‌ల్‌గా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తైవాన్ పెట్టుబడుల‌కు తెలంగాణ అత్యంత ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని అన్నారు. తెలంగాణ- తైవాన్ మధ్య అద్భుతమైన భాగస్వామ్యం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటిదాకా తెలంగాణ- తైవాన్ మధ్య అద్భుతమైన భాగస్వామ్యం ఉందని తెలిపారు. తైవాన్ పెట్టుబడుల కోసం గ‌తంలో ఆ దేశంలో పర్యటించిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.

తైవాన్ దేశానికి సంబంధించిన టీసీఏ తో టెక్నాలజీ పార్ట్‌న‌ర్‌షిప్‌ అగ్రిమెంట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తవించారు. ఇండియన్- తైవాన్ స్టార్టప్ భాగస్వామ్యం ఏర్పాటు చేసిన ఏకైక భారత సిటీగా హైదరాబాద్ ఉందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో సుమారు 32 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించిందని కేటీఆర్​ వివరించారు. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజాలను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/