శిథిలావస్థ భవనాలను ఖాళీ చేయించండి

జీహెచ్‌ఎంసీ అధికారులకు మంత్రి కెటిఆర్‌ ఆదేశాలు

TS Minister Ktr
TS Minister Ktr

హైదరాబాద్‌‌: హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి కెటిఆర్‌ జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. హైదరాబాదు పరిధిలో శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించాలంటూ అధికారులను ఆదేశించారు. పాత భవనాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని, ఆ భవనాల్లో నివసిస్తున్న వారిని తక్షణమే ఖాళీ చేయించాలని స్పష్టం చేశారు. ప్రాణ నష్టాన్ని నివారించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు పాత భవనాల యజమానులకు వివరించాలని కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. ఈ వర్షాకాలంలో హైదరాబాద్ నగరం అత్యధిక వర్షపాతాన్ని చవిచూసింది. ఈ క్రమంలో పాత భవంతులు కూలిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/