లాక్ డౌన్ తర్వాత జీవితం.. కెటిఆర్ ఫన్నీ ట్వీట్
లాక్ డౌన్ తర్వాత జనాలు ఇష్టంవచ్చినట్టు చేసే అవకాశం ఉందంటూ సరదాగా ట్వీట్
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కెటిఆర్ లాక్డౌన్ అనంతరం అందరి కార్యకలాపాలు ఇలా ఉండొచ్చని ట్విట్ చేశారు. ఇక్కడెవరూ సజీవంగా బయటపడే పరిస్థితి లేనందున మరో ఆలోచన దిశగా మిమ్మల్ని మీరు నడిపించుకోవద్దు. మీ ఇష్టం వచ్చినట్టు చేసేయండి. రుచికరమైన ఆహారం భోంచేయండి. సూర్యరశ్మిని ఆస్వాదిస్తూ హాయిగా నడవండి. సముద్రంలో దూకండి. హృదయాన్ని ఓ పెన్నిధిలా పొదివిపట్టుకు తిరుగుతున్నామన్న సత్యాన్ని చాటిచెప్పండి. అప్పుడప్పుడు సిల్లీగా ఉండండి. కొంచెం దయతోనూ వ్యవహరించండి. మరికొంచెం విచిత్రంగానూ ఉండండి. ఇంకేదీ వదిలిపెట్టేందుకు సమయం లేదు. అన్ని ఇప్పుడే చేసేయండి. అంటూ సరదాగా ట్వీట్ చేశారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/