మెయిన్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ప్రారంభం

YouTube video
Minister KTR Launches Daily Water Supply at Main Balancing Reservoir In Karimnagar.

కరీంనగర్‌: శాతవాహన వర్సిటీలో రూ. 110 కోట్లతో ఏర్పాటు చేసిన మెయిన్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను మంత్రి కెటిఆర్‌ ప్రారంభించారు. ఈ ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ..కరీంనగర్‌ పట్టణంలో ప్రతి రోజు మంచి నీరు అందించే కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని కెటిఆర్‌ అన్నారు. ఇక్కడి నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధి పనుల విస్తరణ జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలో 247 వాటర్‌ సైప్లె కూడా కరీంనగర్‌ నుంచే ప్రారంభం కావాలన్నారు. 30 ఏళ్ల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టినట్లు కేటీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రమంత ఈ పథకం ఆదర్శం కావాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో దీర్ఘకాలిక ప్రణాళికలతో కీలక రంగాలపై దృష్టి పెట్టామని తెలిపారు. ఒక్కో పని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తున్నామని ఆయన చెప్పారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/