నిరుపేదల మొహాల్లో సంతోషం చూడడమే ప్రభుత్వ లక్ష్యం

సిరిసిల్ల : మంత్రి కేటీఆర్‌ బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్, గొల్లపల్లి ఎల్లారెడ్డిపేట గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలకోసం రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో డబుల్‌ బెడ్రూం ఇళ్లను కట్టించి ఇచ్చామని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వమని కేటీఆర్‌ అన్నారు.


నిరుపేదల మొహాల్లో సంతోషం చూడడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలా డబుల్‌ బెడ్రూం ఇండ్లను నిర్మించి పేదలకు ఇవ్వడం లేదు. త్వరలో అర్హులందరికీ కొత్త రేషన్‌ కార్డులు, పింఛన్లు మంజూరు చేస్తాం’’ అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో రోడ్డు-భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్‌పల్లి వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/