పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కించిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్ః మంత్రి కెటిఆర్ హైదరాబాద్లోని పంజాగుట్ట చౌరస్తాలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, హైదరాబాద్ మేయర్ విజయ లక్ష్మి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జై భీమ్.. జై కెసిఆర్ నినాదాలతో పంజాగుట్ట కూడలి మారుమోగింది.