బస్తీ దవాఖానాను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్: షేక్పేట్లోని రాజీవ్ గాంధీ నగర్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ బస్తీ దవాఖానాల్లో ఓపీడీ కన్సల్టేషన్, టెలీ కన్సల్టేషన్, బేసిక్ ల్యాబ్ డయాగ్నోసిస్, సాధారణ అనారోగ్య చికిత్సలకు వైద్యం అందించనున్నారు. శుక్రవారం నగర వ్యాప్తంగా 32 బస్తీ దవాఖానాలను ప్రారంభించారు.
.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/