నేటి నుండి మంత్రి కేటీఆర్ పది రోజుల విదేశీ పర్యటన

లండన్‌కు కేటీఆర్ అక్కడ వివిధ కంపెనీల అధినేతలు, సీఈవోలతో భేటీ
22 నుంచి దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరు
26న తిరిగి హైదరాబాద్‌కు..

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ పది రోజుల విదేశీ పర్యటన నిమిత్తం నేడు లండన్ బయలుదేరనున్నారు. ఈ ఉదయం పది గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్తారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రి పర్యటన సాగనుంది. లండన్‌లో పలు కంపెనీల అధిపతులు, సీఈవోలతో కేటీఆర్ భేటీ అవుతారు.

అనంతరం అక్కడి నుంచి స్విట్జర్లాండ్ చేరుకుంటారు. దావోస్‌లో ఈ నెల 22 నుంచి 26 వరకు జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి పాల్గొంటారు. ఆ సదస్సుకు హాజరయ్యే పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల అధినేతలు, సీఈవోలతో భేటీ అవుతారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వారితో చర్చించి రాష్ట్రానికి ఆహ్వానిస్తారు. అనంతరం ఈ నెల 26న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/