విద్యార్థులకు ట్యాబ్‭లను పంపిణీ చేసిన మంత్రి కెటిఆర్‌

minister-ktr-distribute-tabs-to-students-in-rajanna-sircilla

ఎల్లారెడ్డిపేటః రాజన్న సరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో.. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్‌ పాల్గొన్నారు. విద్యావ్యవస్థలో మార్పు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కెటిఆర్ చెప్పారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా.. రాష్ట్రంలోని 26వేల పాఠశాలలను అభివృద్ది చేస్తామని ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమంలో భాగంగా 2వేల మంది విద్యార్థులకు మంత్రి కెటిఆర్ ట్యాబ్‭లను పంపిణీ చేశారు. ఒక్కో ట్యాబ్ విలువ రూ.86వేలు ఉంటుందన్న ఆయన.. విద్యార్థులకు పోటీ పరీక్షల సమయంలో దీని ఉపయోగం ఎంతగానో ఉంటుందన్నారు. ఎల్లారెడ్డిపేటను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. జిల్లాలోని పాఠశాలలను రాష్ట్రంలో భిన్నంగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలోనే సిరిసిల్ల జిల్లాకు స్వచ్ఛ్ సర్వేక్షణ్ లో గ్రామీణ అవార్డు వచ్చిందని చెప్పారు. ఇక వేములవాడ నియోజకవర్గంలో కూడా 3 వేల ట్యాబ్‭లు అందజేస్తామని కెటిఆర్ తెలిపారు.