జాతీయ చేనేత దినోత్స‌వ వేడుకలో మంత్రి కేటీఆర్

తెలంగాణ నేత‌న్న‌ల‌కు దేశంలో ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది: మంత్రి కేటీఆర్

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ న‌గ‌రంలోని పీపుల్స్ ప్లాజాలో జాతీయ చేనేత దినోత్స‌వ వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు. సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో ప్ర‌తి సంవ‌త్స‌రం జాతీయ‌ చేనేత దినోత్స‌వాన్ని తెలంగాణ‌లో ఘ‌నంగా జ‌రుపుకుంటున్నాం అని పేర్కొన్నారు. తెలంగాణ నేత‌న్న‌ల‌కు దేశంలో ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. చేనేత కార్మికుల‌కు ఉపాధి, ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నాం అని తెలిపారు. 2018 నుంచి కొండా ల‌క్ష్మ‌ణ బాపూజీ పేరుతో అద్భుత‌మైన చేనేత‌ క‌ళాకారుల‌ను స‌త్క‌రించి, అవార్డులు అందిస్తున్నామ‌ని తెలిపారు. అవార్డుతో పాటు న‌గ‌దు పుర‌స్కారం రూ. 25 వేల‌ను అందించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఈ ఏడాది 31 మంది చేనేత‌ క‌ళాకారుల‌ను స‌త్క‌రించుకున్న‌ట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

ప్ర‌తి సంవ‌త్స‌రం ఎగ్జిబిష‌న్ నిర్వ‌హించి, చేనేత వ‌స్ర్తాల‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తెస్తున్నామ‌ని కేటీఆర్ తెలిపారు. ఈ ప్ర‌త్యేక‌మైన నైపుణ్యాన్ని దేశ ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసేందుకు ఈ -కామ‌ర్స్ ద్వారా ఈ -గోల్కొండ పోర్ట‌ల్‌ను రూపొందించుకున్నాం. వీటి ద్వారా చేనేత అమ్మ‌కాల‌ను విక్ర‌యిస్తున్నాం. గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా మ‌న సంప్ర‌దాయాన్ని, స‌మ‌కాలీన మార్పుల‌ను దృష్టిలో ఉంచుకుని.. కొత్త‌కొత్త డిజైన్ల‌తో ఈత‌రం, భ‌విష్య‌త్ త‌రం పిల్ల‌ల‌ను ఆక‌ట్టుకునే విధంగా డిజైన్ల‌ను రూపొందిస్తున్నాం. అలా చేయ‌డం వ‌ల్ల ప‌ది కాలాల పాటు మ‌నుగడ ఉంటుంద‌నే ఉద్దేశంతో ఫ్యాష‌న్ షోల‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/