సీఎం జగన్ ఔట్ డేటెడ్ పొలిటీషియన్ అని నోరు జారిన వైస్సార్సీపీ మంత్రి

రాజకీయ నేతలు మాట్లాడేటప్పుడు వారి నోరు అదుపులో ఉండదు ..క్షణికావేశంలో , అత్యుత్సాహంలో ఒక్కోసారి వారు ఏమాట్లాడుతున్నారో వారికీ తెలియకుండా మాట్లాడేస్తుంటారు. కొన్ని సార్లు సొంత పార్టీ నేతలపై , ముఖ్యమంత్రులపై ఇష్టంవచ్చినట్లు మాట్లాడి నాలుక కరుచుకుంటారు. తాజాగా వైస్సార్సీపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అలాగే మాట్లాడాడారు. సీఎం జగన్ ఔట్ డేటెడ్ పొలిటీషియన్ అని నోరు జారీ వార్తల్లో నిలిచారు.

సామాజిక న్యాయభేరి పేరిట వైస్సార్సీపీ మంత్రులు బస్సు యాత్ర మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. మూడో రోజు కొనసాగుతున్న ఈ యాత్ర ప్రస్తుతం కృష్ణా జిల్లాకు చేరింది. గన్నవరం వద్ద నిర్వహిస్తున్న సభలో ఏపీ సివిల్ సప్లై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ..చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అదే అత్యుత్సాహంలో అధికారం కోల్పోయి ఈర్ష్య, ధ్వేషం, కుళ్లు, కుతంత్రాలతో దుర్మార్గంగా ఆలోచిస్తున్న సీఎం జగన్ ఔట్ డేటెడ్ పొలిటీషియన్ అని నోరు జారాడు. టీడీపీ మహానాడులో చంద్రబాబు, లోకేష్ ఫోటోలు మాత్రమే కనిపించాయని, మిగిలిన నాయకుల ఫోటోలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. కాగా, మంత్రి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.