ముందస్తు ఎన్నికల ఫై మంత్రి జోగి రమేష్ క్లారిటీ

ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని..అందుకే అన్ని పార్టీల నేతలు ప్రచారానికి సిద్దమవుతున్నారనే వార్తలు గత కొద్దీ రోజులుగా చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అధికార పార్టీ నేత , మంత్రి జోగి రమేష్ ముందస్తు ఎన్నికల ఫై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావని తేల్చి చెప్పారు. అలాంటి పరిస్థితులేమీ లేవని .. ఎన్నికలు ప్రకారమే వస్తాయని వెల్లడించారు.

టీడీపీ అంతిమదశలో ఉంది కాబట్టే ముందస్తు అంటూ చంద్రబాబు డ్రామాలు మొదలుపెట్టాడని జోగి రమేశ్ మండిపడ్డారు. టీడీపీ ఇప్పటికే వెంటిలేటర్ పై ఉందని, ఇక బతికే అవకాశమే లేదని, వల్లకాడుకు పోవడమే మిగిలుందని ఎద్దేవా చేసారు. అంతే కాదు చంద్రబాబు వెన్నుపోటు పాపంలో యనమల కూడా భాగస్వామి అని, చంద్రబాబు, యనమల తమ ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా? అని ప్రశ్నించారు. అలాగే రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాల పురోగతిపై చంద్రబాబు, లోకేశ్ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.