బిజెపి నేతలను మిడతలతో పోల్చిన మంత్రి జగదీష్ రెడ్డి

బిజెపి నేతలను మిడతలతో పోల్చారు మంత్రి జగదీష్ రెడ్డి. మంగళవారం మర్రిగూడెం, గట్టుపల్ మండల కేంద్రాలలో టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. బిజెపి నాయకులు కేసీఆర్ పేరు వింటేనే వణికిపోతున్నారని , మునుగోడులో గులాబీ పార్టీ కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేస్తున్నారని.. బిజెపి కుట్రలను ఎక్కడికక్కడ తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.

మునుగోడు లో టిఆర్ఎస్ పార్టీ భారీ విజయంతో గెలువబోతుందని , కాంగ్రెస్ పార్టీ పాలనలో మునుగోడులో కరువు తాండవించిందని ఆరోపించారు. ఫ్లోరైడ్ భూతంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని అన్నారు. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే మునుగోడు దశ దిశ తిరిగిందని.. ఫ్లోరైడ్ అంతం అయిందన్నారు. కేసీఆర్‌ నాయకత్వమే మనందరికి శ్రీరామ రక్ష. గులాబీ జెండా నీడలోనే ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుతున్నారు. అందుకే కేంద్రం కేంద్రం సీఎం కేసీఆర్‌ను చూసి ఓర్వడం లేదన్నారు. తెలంగాణపై విషం చిమ్ముతూ బీజేపీ నాయకులు మిడతల్లాగా వచ్చి తెలంగాణాపై దాడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అయితే కేసీఆర్‌ను అపే శక్తి ఎవ్వరికి లేదన్నారు. దేశ ప్రజలు తెలంగాణా సాధించిన విజయాల గురించి మాట్లాడుతున్నరు. అందుకే బీజేపీ నాయకులు కేసీఆర్‌ పేరు వింటేనే బెంబేలెత్తిపోతున్నారు.