నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి హరీష్

హైదరాబాద్ : వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు నేడు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పర్యటించనున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. తొలుత బాస‌ర జ్ఞాన స‌ర‌స్వతీ అమ్మవారిని ద‌ర్శించుకోనున్నారు. అనంతరం నిర్మల్ జిల్లా ముధోల్ లో 30 ప‌డ‌క‌ల ఆసుప‌త్రి నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు.

మధ్యాహ్నం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిట‌ల్ లో రేడియాల‌జీ ల్యాబ్ నిర్మాణానికి శంఖుస్థాప‌న చేస్తారు. తరువాత జిల్లా కేంద్రంలో 250 ప‌డ‌క‌ల జిల్లా ఆసుప‌త్రి భ‌వ‌న నిర్మాణానికి శంఖుస్థాప‌న చేస్తారు. సాయంత్రం 4 గంట‌ల‌కు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రేడియాల‌జీ ల్యాబ్ నిర్మాణానికి శంఖుస్థాప‌న చేసి అనంతరం రిమ్స్ సూప‌ర్ స్పెషాలిటీ బ్లాక్ ను ప్రారభించనున్నారు. అనంతరం వైద్య, ఆరోగ్యంతో పాటు ఇత‌ర విభాగాల‌పై స‌మీక్ష స‌మావేశం నిర్వహించనున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/