ప్రభుత్వ దవాఖానను సందర్శించిన మంత్రి హరీష్ రావు

ఆదిలాబాద్: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను సందర్శించారు. అనంతరం వైద్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో స్థానికులకు మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పేదలకు వైద్యసేవలు అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు స్థానికంగా వైద్యం అందించాలన్నారు. సర్కార్‌ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు పెరిగేలా చూడాలని సూచించారు. రెఫరల్ కేసులు తగ్గించాలని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/