పలు అభివృద్ధి పనులపై హరీశ్‌ రావు సమీక్ష

minister Harish Rao

సిద్దిపేట: రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామరెడ్డితో కలిసి దుబ్బాక పరిధిలోని పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని చేగుంట మండలంలోని అన్నీ గ్రామాల్లో గ్రేవ్ యార్డులు నిర్మాణం, డంప్ యార్డుల నిర్మాణాల్లో వేగం పెంచాలన్నారు. సత్వరమే వాటిని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. చేగుంటలో డంప్‌యార్డు నిర్మాణాలు పూర్తి ఎర్రలు వేసి కంపోస్ట్‌ తయారీకి సిద్ధం చేసిన ఎంపీడీఓను మంత్రి హరీశ్‌రావు అభినందించారు. అలాగే నియోజకవర్గంలో విద్యుత్‌ సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లో వోల్టేజీ లేకుండా చూడాలని, అవసరమైతే కొత్తగా, అదనపు టాన్స్‌ఫార్మర్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు ఇస్తే నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయా మండలాల వారీగా పనులు ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వేగవంతం చేసేందుకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/