పట్టణంలో ప్లాస్టిక్ ను నిషేధిద్దాం

Minister-Harish Rao

సిద్దిపేట: ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సిద్ధిపేట మున్సిపాలిటీ రంగధాంపల్లి తొమ్మిదో వార్డులో సోమవారం స్టీల్ బ్యాంక్ ను మంత్రి ప్రారంభించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట పట్టణంలో ప్లాస్టిక్ ను నిషేధిద్దాం. పర్యావరణాన్నిపరిరక్షిద్దామని హరీశ్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడకాన్నిబంద్ చేస్తూ.. ప్రత్యామ్నాయంగా స్టీల్ బ్యాంక్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు స్టీల్ బ్యాంకును సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. స్టీల్ బ్యాంక్ సామగ్రి కిరాయి సమగ్ర పట్టిక వివరాల పత్రికలను మంత్రి ఆవిష్కరించారు. వార్డుల్లోని ప్రతి ఇంటింటా తిరిగి అవగాహన కల్పించాలని ఆ వార్డు కౌన్సిలర్, మెప్మా, ఆర్పీలను మంత్రి ఆదేశించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/