చంద్రబాబు కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ – గుడివాడ అమర్‌నాథ్‌

gudivada-amarnath

జనసేనపార్టీ ఫై వైసీపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పలు వ్యాఖ్యలు చేసారు. శనివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు యాత్ర లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించి ఆత్మ హత్య చేసుకొన్నా కౌలు రైతుల కుటుంబాలకు ఆర్ధిక సాయం చేసిన సంగతి తెలిసిందే. అలాగే చింతలపూడి లో రచ్చ బండ కార్య క్రమంలో వైసీపీ సర్కారు ఫై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వైసీపీ నేతలు వరుస పెట్టి పవన్ కళ్యాణ్ ఫై మాటల దాడి చేస్తున్నారు.

ఈరోజు ఆదివారం రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మీడియా తో మాట్లాడుతూ.. చంద్రబాబు కోసం పుట్టిన పార్టీ జనసేన అని మండిపడ్డారు. జనసేనకు సిద్ధాంతాలు లేవు.. చంద్రబాబు కోసమే పనిచేస్తోందని దుయ్యబట్టారు. చంద్రబాబు దత్త పుత్రుడు.. వైఎస్‌ జగన్ ప్రభుత్వంపై చేసిన విమర్శలు విడ్డూరంగా వున్నాయి. కౌలు రైతుల కష్టాలకు చంద్రబాబు కారణమని దత్త పుత్రుడు తెలుసుకోవాలని మంత్రి హితవు పలికారు.

2014లో అధికారంలో రావడానికి చంద్రబాబు కౌలు రైతులను మోసగించారు. కౌలు రైతుల మరణాలకు చంద్రబాబు కారణం. రైతుల మరణాలపై కేసులు కూడా నమోదు చెయొద్దని చంద్రబాబు ఆ రోజుల్లో ఆదేశాలు కూడా ఇచ్చారు. పవన్ అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు. రైతుల రుణ మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేయలేదా ?. ఎన్టీఆర్‌ను వెన్ను పోటు పొడిచి.. ఆయన మరణానంతరం ఆయన ఫోటోకు దండలు వేసే నైజం చంద్రబాబుది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.