పోలీసు అమరవీరులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ నివాళులు

minister-errabelli-dayakar-pays-tribute-to-police-martyrs

వరంగల్: వరంగల్‌లోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన పోలీసు అమర వీరుల సంస్మరణ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు అమరులకు నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని అమలు చేస్తూ, సమాజాన్ని సక్రమ మార్గంలో పెడుతున్నది పోలీసులేనని చెప్పారు. పోలీసు వృత్తి అనేక ఒత్తిడిలతో కూడుకున్నదని మంత్రి అన్నారు. వృత్తిధర్మం కోసం కుటుంబాలను కూడా లెక్కచేయకుండా పోలీసులు పనిచేస్తున్నారని చెప్పారు. కర్తవ్య నిర్వహణలో కొందరు తమ ప్రాణాలను కోల్పోవడం బాధాకరమని, వారి త్యాగాలు గొప్పవన్నారు. పోలీసు అమరుల కుటుంబాలను సరైన రీతిలో ఆదరించడం, గౌరవించుకోవడం మన విధి అని చెప్పారు. తాను రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నాటి నుంచి ఈ కార్యక్రమంలో క్రమంతప్పకుండా పాల్గొంటున్నాని తెలిపారు.  ఈ కార్యక్రమంలో సిపి తరుణ్ జోషి వివిధ స్థాయిల పోలీసు అధికారులు, పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.