మంత్రి హరీష్ రావు ఫై ఏపీ మంత్రి బొత్స ఫైర్..

ap prc-Call for employee unions for negotiations
ap-minister-botsa

బిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్స్ ఫై వైస్సార్సీపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని ఏపీ ప్రజలు సొంతం రాష్ట్రంలో ఓటు హక్కు వదులుకుని తెలంగాణలో తీసుకోవాలని మంత్రి హరీష్ రావు కోరారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు పలు కీలక వ్యాఖ్యలు చేయగా..తాజాగా మంత్రి బొత్స సైతం ఫైర్ అయ్యారు.

బాధ్యత గల వ్యక్తులు బాధ్యతగా మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. ప్రత్యేక హోదాపై ఎవరు మాట్లాడతారో, ఎవరు మాట్లాడరో తమకు తెలుసన్నారు. వారు ముందు తమ రాష్ట్రం గురించి చూసుకోవాలని, చరిత్ర మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని బొత్స అన్నారు. ఏపీ ప్రజలు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో అందరికీ తెలుసని, ఎప్పుడూ లేనిది ఇప్పుడెందుకు అలా మాట్లాడుతున్నారో హరీశ్‌రావునే అడగాలని విలేకరులకు సూచించారు.