కాపులను తాకట్టు పెట్టేందుకు పవన్ సిద్దమయ్యారంటూ మంత్రి అమర్ నాధ్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాద్ ..మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు. కాపులను తాకట్టు పెట్టేందుకు పవన్ సిద్దరామయ్యరని , టీడీపీలో ఒక సీనియర్ కార్యకర్త పవన్ కళ్యాణ్ ని మంత్రి అమర్ నాధ్ అన్నారు. ఆదివారం వేపగుంట కాపు సామాజిక భవన ప్రారంభోత్సవ సభలో పాల్గొన్న అమర్ నాద్ ఈ వ్యాఖ్యలు అన్నారు.

ఇప్పటికే అమర్ నాద్ ఫై జనసేన కార్య కర్తలు , అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా..ఇప్పుడు మరోసారి నోరు జారడం తో పలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇదే క్రమంలో సీనియర్ రాజకీయ నేత హరిరామ జోగయ్య..అమర్ నాద్ కు లేఖ రాశారు. నువ్వు రాజకీయాల్లో బచ్చావి, పైకి రావాల్సిన వాడివన్నారు. సాధారణ మంత్రి పదవికి అమ్ముడు పోయి కాపుల భవిష్యత్తు నాశనం చేయకని హెచ్చరించారు. అనవసరంగా పవన్ కళ్యాణ్ పై బురద చల్లే ప్రయత్నం చేయకు..నీ మంచి కోరి చెబుతున్నానని ..హరి రామజోగయ్య అన్నారు.