కెసిఆర్ అండతో ఎంఐఎం నేతలు రెచ్చిపోతున్నారు
అసదుద్దీన్ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు
విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వ అండతో ఎంఐఎం నేతలు రెచ్చిపోతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. లక్షల మంది ఒవైసీలు అడ్డొచ్చినా సీఏఏను అమలు చేసి తీరతామని ఆయన స్పష్టం చేశారు. హైదరాబద్ ఎంపీ అసదుద్దీన్ బాధ్యతలేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎంఐఎం, టిఆర్ఎస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కిషన్రెడ్డి హెచ్చరించారు. కుటుంబ పార్టీల పాలనకు ప్రజలు త్వరలోనే బుద్ది చెప్తారని కిషన్రెడ్డి అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లు కూడా సీఏఏ వ్యతిరేకంగా తీర్మానాలు చేయడం సిగ్గుచేటన్నారు. ఢిల్లీలో హింసకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/