ప్రపంచ దేశాలతో చైనా తీరు సరికాదు

ప్రపంచ దేశాల ప్రజలకు ముప్పు..మైక్‌ పాంపియో

Mike Pompeo
Mike Pompeo

వాషింగ్టన్‌: గత కొన్ని రోజులుగా అమెరికా- చైనాల మధ్య వివాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో తాజాగా ఆ దేశ విదేశాంగా మంత్రి మైక్‌ పాంపియో మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలతో చైనా వ్యవహరిస్తోన్న తీరుపై మండిపడ్డారు. చైనా వ్యవహారంలో అమెరికా సహా మిత్రదేశాలు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని చెప్పారు. చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ తన తీరును మార్చుకునేలా చేయడమే ప్రస్తుతం ప్రపంచం ముందున్న విషయమని తెలిపారు.

డ్రాగన్ సైన్యం మరింత దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని మైక్‌ పాంపియో చెప్పారు. ప్రపంచ దేశాల విధానాలు డ్రాగన్ దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి సహకరిస్తున్నాయని, అయితే తనకు ఉపయోగపడుతున్న దేశాల పట్ల కూడా చైనా ప్రతికూల ధోరణితో ముందుకు వెళ్తోందని ఆయన విమర్శించారు. చైనా పాల్పడుతున్న చర్యలు ప్రపంచ దేశాల ప్రజలకు, అర్థిక వ్యవస్థకు ముప్పుగా పరిణమిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి సమయంలో స్వేచ్ఛను కోరుకునే దేశాలు చైనా తీరు మారేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని పిలుపు ఇచ్చారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/