సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ లాభం 83 వేల కోట్లు
వాషింగ్టన్: ప్రముఖ సాఫ్టవేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(201920) రెండవ త్రైమాసికం(అక్టోబరుడిసెంబరు)లో 82890 కోట్ల రూపాయల లాభం కలిగింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 38 శాతం ఎక్కువ. సంస్ధ రెవెన్యూలో 14 శాతం వృద్ధితో 2.63 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుతం కంపెనీ షేర్ విలువ 40 శాతం పెరిగి 1.51 డాలర్కు చేరింది. కంపెనీ ఆర్థిక గణాంకాలు ఆశించిన స్థాయి కంటే బాగున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ సంస్థలో అన్నింటి కంటే పెద్ద రెవెన్యూ విభాగం క్లౌడ్ సర్వీసింగ్లో ఉన్న అజ్యూర్ డివిజన్ 62 శాతం గ్రోత్ మాత్రమే నమోదైంది. ఇదే విభాగం గత సంవత్సర 63 శాతం వృద్ధి నమోదైంది. మైక్రోసాఫ్ట్ సంస్థ తన షేర్హోల్డర్లకు డివిడెండ్, షేర్ బయ్ బ్యాక్ ద్వారా 60745 కోట్లు ఇచ్చింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/