మెక్సికోలో 24 గంటల్లో 522 మంది కరోనాతో మృతి
మొత్తం కేసులు సంఖ్య 6,23,090
మెక్సికో: మెక్సికోలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల వ్యవధిలో 522 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఆ దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 66,851కి చేరింది. ఇక కరోనా పాజిటివ్ కేసులు కూడా ప్రతిరోజు భారీగానే ఉంటున్నాయి. 24 గంటల వ్యవధిలో కొత్తగా 6,196 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో మెక్సికోలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,23,090కి చేరింది. అంతకుముందు రోజు కూడా అక్కడ 5,937 పాజిటివ్ కేసులు, 513 మరణాలు నమోదయ్యాయి. మెక్సికో డిప్యూటీ హెల్త్ మినిస్టర్ హ్యూగో లోపెజ్ గాటెల్ ఈ వివరాలను వెల్లడించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/